ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లిoపు పై లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ రెడ్డి కి విదసం పిర్యాదు..

MEDIA POWER
0


విశాఖ‌ప‌ట్నం: దళితుల ఆర్థిక పురోభివృద్ధి, స్వయం ఉపాధి, దళిత వాడలలో మౌలిక సదుపాయాలు కల్పన కోసంమే ఖర్చు చేయాల్సిన సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించి ఎస్సీ లకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ రెడ్డి కి విదసం ఐక్యవేదిక ప్రతినిధులు పిర్యాదు చేశారు.  ఈ రోజు విశాఖ పర్యటన కు వచ్చిన ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ రెడ్డి ని విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక నాయకత్వం సర్క్యూట్ హౌస్ లో కలిసి వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా ఎస్సీ సంక్షేమ పథకాలు రద్దు చేసిన విషయం, సబ్ ప్లాన్ అమలు జరగని అంశం వి ద సం ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు జస్టిస్ లక్ష్మణ రెడ్డి కి వివరించారు.  భారత రాజ్యాంగం ఆర్టికల్ 38,46 ను అనుసరించి, కేంద్రం అమలు చేస్తున్న షెడ్యూలు కాస్ట్ సబ్ ప్లాన్, ట్రైబల్ కాంపోనెంట్ ప్లాన్ ఆధారంగా 2013 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం తెచ్చిందని...ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టo  ప్రకారం ఆదాయం ఉత్పత్తి ని, దారిద్య‌ రేఖకు ఎగువకు తెచ్చే స్వయం ఉపాధి పథకాలు కోసం రుణాల మంజూరుకు  కేంద్రం నిర్దేశించిన కేంద్ర ప్రభుత్వం సహాయక / ప్రోత్సాహక పధకాలకు  వెచ్చిం చాలి. కాని సబ్ ప్లాన్ ప్రత్యేక పధకాల కోసం కాకుండా సాధారణ పధకాలు ఆయన వైఎస్ఆర్   పెన్ష‌న్‌ కానుక, వైఎస్ఆర్  చేయూత, వైఎస్ఆర్ ఆసరా, అమ్మ వడి వంటి వాటికి మాత్రమే ఖర్చు  చేశారు.

    నవ రత్న పధకాలకు అన్ని వర్గాల ప్రజలకు సాధారణ బడ్జెట్ నిధులు నుండి ఖర్చు చేస్తుoడగా ఎస్సీ ఎస్టీ లకు మాత్రం సాధారణ బడ్జెట్ నిధులు మంజూరు చేయకుండా వివక్ష చూపుతూ  సబ్ ప్లాన్ నిధులు  మళ్లించడం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నేరం. ఈ చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి లను బాధ్యులు గుర్తించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద విచారణ జరిపి   తగు చర్యలు తీసుకోవాలని లోకాయుక్త కు విజ్ఞప్తి చేశారు.     

    ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఒక ప్రత్యేక చట్టం. ఈ చట్టం కింద దోషుల పై విచారణ, బెయిల్ మంజూరు అధికారం సెషన్స్ న్యాయమూర్తి కి  మాత్రమే ఉండగా,  పోలీసు అధికారులు స్టేషన్ బెయిల్ మంజూరు చేస్తున్నారు. ఈ విధంగా బెయిలు మంజూరులో అవినీతికి ఆస్కారం ఉంది, దోషి స్వేచ్ఛగా తిరుగుతూ బాధితులను పరిహాసం మరియు ఛాలెంజ్ చేస్తూ సాక్ష్యలను తారుమారు చేస్తున్నారు. చట్టం నిర్వీర్యం అవుతుంద ని  లోకాయుక్త జోక్యం చేసుకుని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ గారికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.  దీని పై జస్టిస్ లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ పోలీసు అధికారులు తప్పిదం చేస్తే లోకాయుక్త కేసులు నమోదు చేస్తుందని, సబ్ ప్లాన్ విషయం లో లోకాయుక్త పరిది ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ వేమన, సోడ దాసి సుధాకర్, ఈతల పాక సుజాత, వడ్లమూరి ఫ్రాన్సిస్, డి నిర్మల, బంటు కృష్ణా రావు, గుడివాడ అప్పారావు, కస్తూరి వెంకట రావు, డి.విజయ కుమార్, జి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">