చందనోత్సవానికి తరలివచ్చిన భక్తజ‌నం ... జ‌న సంద్రంగా మారిన సింహాచ‌ల పుణ్య‌క్షేత్రం

MEDIA POWER
0


సింహాచలం: విశాఖపట్నం జిల్లా సింహాచలంలో శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం ఘనం జ‌రిగింది. ఉదయం నుంచి భక్తులు స్వామివారి నిజరూప దర్శనానికి బారులుతీరారు. ఆలయ అనువంశిక ధర్మకర్త, దేవస్థానం ఛైర్మన్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు తొలి చందన సమర్పణ చేసి స్వామివారిని  ద‌ర్శించుకున్నారు. అనంతరం  తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌, రాష్ట్ర మంత్రులు కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్‌, అవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, పీవీఎన్‌ మాధవ్‌ సహా పలువురు ప్రజాప్రతినిధులు స్వామివారి నిజరూపాన్ని దర్శించుకున్నారు. చందనోత్సవం విశేష‌పర్వదినం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాలభ‌కు్త‌లే కాకుండా  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో సింహగిరిపై భ‌క్తుల కోలాహ‌లం క‌న‌ప‌డింది.  భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయశాఖ సిబ్బంది చేసిన ఏర్పాట్లు భ‌క్తుల మ‌న్న‌న‌లు పొందాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">