రాష్ట్ర ముఖ్య మంత్రి పర్యటన లో అధికారులు సమన్వయం తో పనిచేసి విజయవంతం చేద్దాం: ఉప ముఖ్యమంత్రి
మీడియా పవర్, కుప్పం,సెప్టెంబర్ 12: గౌరవ రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 22న 3 వ విడత వై. ఎస్.ఆర్ చేయూత కార్యక్రమంను కుప్పం నుండి ప్రారంభించనున్నారని ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారాన్ని అoదించి విజయవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఎక్సైజ్ శాఖామాత్యులు నారాయణ స్వామి తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో భాగంగా సోమవారం కుప్పం లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో రాష్ట్ర అటవీ, ఇందన, విద్యుత్ మరియు శాస్త్ర,సాంకేతిక శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎన్.రెడ్డప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సలహాదారు తలశీల రఘురాం, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్, జిల్లా ఎస్పి రిశాంత్ రెడ్డిలతో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ నవరత్నాల పథకాల అమలులో భాగంగా 3 వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కుప్పం నుండి ప్రారంభించనున్నారని తెలిపారు. 45 నుండి 60 సం. ల మధ్య వయసు గల ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీవర్గాల మహిళలకు వై.ఎస్.ఆర్ చేయూత క్రింద రూ.18,750/- లు అందించనున్నారని తెలిపారు. నవరత్నాల అమలుతో పేదల ఇంట్లో వెలుగు నింపిన ముఖ్యమంత్రి కుప్పం విచ్చేయు చున్న సందర్భంగా ఉన్నతాధికారులు మరియు జిల్లా అధికారులు, సిబ్బంది సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
అనంతరం రాష్ట్ర అటవీ, ఇందన, విద్యుత్ మరియు శాస్త్ర సాంకేతిక శాఖా మాత్యు లు శ్రీ డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ 3 వ విడత వై.ఎస్.ఆర్ చేయూత కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు కుప్పం నుండి ప్రారంభించనున్నారని, ఈ కార్యక్రమo లో ఎటువంటి చిన్న లోటుపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా కలెక్టర్ సంబంధితశాఖ అధికారులకు మరియు సిబ్బందికి విధులను కేటాయించడం జరుగుతుందని, జిల్లా యంత్రాంగానికి మంచి పేరు వచ్చేలా తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించి ఈ పర్యటనను విజయవంతం చేయాలని అన్నారు.
జిల్లాకలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 22న రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం పర్యటనను అధికారులందరూ సమన్వయంతో పని చేసి విజయవంతం చేద్దామని అధికారులకు కేటాయించిన విధులను బాధ్యత తో నిర్వహించి ఎటు వంటి పొరపాట్లకు తావు లేకుండా పని చేయాలని ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో చిత్తూరు, పలమనేరు, పూతల పట్టు ఎం ఎల్ ఏ లు ఆరణి శ్రీనివాసులు, వెంకటేగౌడ్, ఎం ఎస్ బాబు, ఎంఎల్సి భరత్, టిటిడి బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, పి కె ఎం చైర్మన్ వెంకట్ రెడ్డి యాదవ్, రాష్ట్ర జానపద కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, ఏ పి ఎస్ ఆర్ టి సి రాష్ట్ర వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి, డి ఆర్ ఓ ఎన్. రాజశేఖర్,డి సి సి బి చైర్మన్ రెడ్డెమ్మ, రేస్కో చైర్మన్ సెంథిల్ కుమార్, చిత్తూరు నగర మేయర్ అముద, కుప్పం మునిసిపల్ చైర్మన్ డా. సుధీర్, కుప్పం ఆర్ డి ఓ శివయ్య, డ్వామా, డి ఆర్ డి ఏ పిడిలు చంద్ర శేఖర్,తులసి, ఆర్ అండ్ బి,పి ఆర్ ఎస్ ఈ లు దేవానందం, చంద్రశేఖర్ రెడ్డి, డి ఈ ఓ పురుషోత్తం, సమగ్ర శిక్ష ఏ పి సి వెంకట రమణా రెడ్డి,ఆర్ టిసి ఆర్ ఎం జితేంద్ర నాధ్,డి టి సి బసి రెడ్డి, డిఎం &హెచ్ ఓ డా.శ్రీహరి, డి పి ఓ లక్ష్మీ,సి పి ఓ ఉమా దేవి,మెప్మా పీడీ రాధమ్మ,వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తది తరులు పాల్గొన్నారు.
