విశాఖపట్నం, మీడియా పవర్ : జిల్లాలో పలువురు తహశీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఉత్తర్వులు జారీచేశారు. పాలనా పరమైన సౌలభ్యం కోసం బదిలీలు చేపడుతున్నామని, వెంటనే అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంబంధిత తహశీల్దార్లు వెంటనే తమకు కేటాయించిన కొత్త స్థానాల్లో జాయిన్ అయి, జాయినింగ్ రిపోర్టులను పంపాలని ఆదేశించారు. బదిలీ అయిన తహశీల్దార్ల వివరాల్లో కి వెళ్తే గాజువాక తహశీల్దార్ గా పనిచేస్తున్న బి.చిన్నికృష్ణ ను కలెక్టర్ కార్యాలయం, ఈ' సెక్షన్ సూపరెంటిండెంట్ గా, కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న రామలక్ష్మి ని పెదగంట్యాడ తహశీల్దార్ కార్యాలయం లోని 'ఈ' సెక్షన్ సూపరెంటిండెంట్ గా, పెదగంట్యాడ .సత్యనారాయణ ను తహశీల్దార్, ఎస్.రాయవరం, ప్రస్తుతం ఎస్.రాయవరం తహశీల్దార్ గా వున్నా కె.వేణుగోపాల్ ను కలెక్టర్ కార్యాలయంలోని సి సెక్షన్, సూపరెంటిండెంట్ గా, కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఎంవీఎస్.లోకేశ్వరరావును తహశీల్దార్ కార్యాలయం గాజువాక 'డీ' సెక్షన్ సూపరెంటిండెంట్ గా, వి.కృష్ణమూర్తి ని రోలుగుంట తహశీల్దార్ గా, డీటీ, 'డి' సెక్షన్, కలెక్టరేట్ లో పనిచేస్తున్న ఎస్.సీతారామరాజు ని సూపరెంటిండెంట్, డీ సెక్షన్ కలెక్టరేట్(ఎస్ఎసీ) కి బదిలీ చేసినట్టు తెలుస్తోంది.