కరొన పై కేరళ ముఖ్యమంత్రి విజయన్ సంచనల వ్యాఖ్యలు

MEDIA POWER
0


సామాజిక వ్యాప్తి దశలో భారత్లో కరోనా


తిరువనంతపురం, జూలై 18 : కరోనా వైరస్ వ్యాప్తి పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా మహమ్మారి సామూహిక వ్యాప్తి ప్రారంభమైందని అన్నారు. దేశంలోనే తొలి వైరస్ కేసు నమోదైన కేరళలో, కఠిన చర్యలతో పాటు అన్ని ఆరోగ్య సదుపాయాలు కల్పించడంతో ఆ రాష్ట్రంలో వైరస్ అదుపులో ఉందన్నారు.  కేసుల సంఖ్య చాలా వరకు తగ్గాయని అన్న ఆయన  రాష్ట్రంలో తగ్గినా దేశవ్యాప్తంగా ఆ వైరస్ తీవ్రంగా ప్రబలుతోందని విజయన్ వ్యాఖ్యానించారు.  దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పది లక్షలు, మృతుల సంఖ్య 25 వేలు దాటిన నేపథ్యంలో పినరయి వ్యాఖ్యలు అత్యంత  ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దేశంలో తీవ్ర స్థాయిలో వైరస్ వ్యాప్తి ఉంటే, ఇంకా సామూహిక వ్యాప్తి ప్రారంభం కాలేదని భారత ప్రభుత్వం ప్రకటించకపోవడాన్ని ఖండించారు. అయితే భారత్ లో మహమ్మారి సామూహిక వ్యాప్తి ప్రారంభమైందని తొలిసారిగా ప్రకటించిన కేరళ ముఖ్య మంత్రి దీనికి కారణాలు వివరించారు. కేరళలోని తిరువనంతపురానికి సమీపంలోని పుల్లువిలా పూన్ తురా గ్రామాల్లో గత కొన్ని రోజులుగా వైరస్ సూపర్ స్పైడర్లు తయారయ్యారని, వారి ద్వారా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోందని పినరయి తెలిపారు. పుల్లువిలాలో 97 శాంపిళ్లను  పరిశీలించగా, 51 మందికి పూన్ తురాలో 50 శాంపిళ్లను పరీక్షించగా 26 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని వివరించారు. దీంతో తిరువనంతపురంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. కేరళలో కొత్తగా 791 కొత్త కేసులు నమోదు కాగా వారిలో 532 మందికి సామూహిక వ్యాప్తి ద్వారా వైరస్ వచ్చినట్లు తెలుస్తోంది. 42 మందికి వైరస్ ఎక్కడి నుంచి వైరస్ సోకిందో అధికారులకు తెలియడం లేదు.  ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. తిరువనంత పురంలో వైరస్ కట్టడిలో భాగంగా జూలై నెల 6 నుంచి లాక్ డౌన్ను అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. సామూహిక వ్యాప్తి కనిపించిన ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని దానిని కట్టడి చేసే ప్రత్నం జరుగుతోందని అయన తెలిపారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">